చంద్రయాన్ 2
· చంద్రయాన్ చంద్రయాన్ చంద్రయాన్.....
· ఈ
మిషన్ గురించిన పేరు ఇండియాలోనే కాదు ప్రపంచలో దాదాపు అన్ని దేశాల్లో అద్యక్షులు,
ప్రధానులు, మినిస్టర్ల నుంచి సై౦టిస్టూలు, టీచర్లు , విద్యార్థుల వరకూ మొత్తం మారు
మోగిపోతోంది.
· చంద్రయాన్
అంటే చ౦ద్రుడిపైకి ఏదో ఒక రాకెట్ పంపడం. అసలు అలా పంపినా దాని వల్ల డబ్బులు బొక్క
తప్పా మనకు ఏదైనా ఉపయోగం ఉందా అసలు? దీనికి అంత బిల్డప్ అవసరమా? ఇదే కదా మీ
డౌట్.
మన దేశ అంతరిక్ష
ఆణిముత్యం I.S.R.O. చేపట్టిన చంద్రయాన్ - 2 గొప్పదనం తెలియాలంటే ఇంతకుముందు అసలు
చంద్రుడిపైన ఏ ఏ దేశాలు అడుగు పెట్టాయి? ఆ దేశాలు ఏం సాధించాయి అనే విషయాలు బ్రీఫ్
గా తెలుసుకుందాం!
సాధారణంగా చంద్రుడిపై ప్రయోగం అంటే మనం మూడు
విధాలుగా అనుకోవచ్చు:
1.
చంద్రుడి ఆర్బిట్ లో ఒక శాటిలైట్
పెట్టి దాన్ని చంద్రుడి చుట్టూ తిప్పి ఫోటోలు తీసి సిగ్నల్స్ ద్వారా భూమిపైకి పంపడం.
అంటే చంద్రుడి ఆర్బిట్ లో ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపడం. ఇప్పటిదాకా, అమెరికా,
రష్యా, చైనా, ఇండియా, జపాన్, యురోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఇలా ఆర్బిట్ లో తమ తమ
స్పేస్ క్రాఫ్ట్ లను పంపాయి.
2.
చంద్రుడి పై డైరెక్టుగా మనుషుల్ని
పంపించి అక్కడి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఇలా చందమామ పైన మనుషుల్ని పంపిన ఏకైక దేశం
అమెరికా. అది కుడా కేవలం ఒకసారి మాత్రమే. ఇప్పటిదాకా ఇలా చంద్రుడిపై మనుషుల్ని
పంపి అమెరికా రికార్డుని బద్దలు కొట్టిన దేశమే లేదు.
3.
చంద్రుడిపైకి మనుషులని కాకుండా
ఏవైనా మెషీన్లు గానీ రోవర్లను గానీ పంపించి అక్కడే ప్రయోగాలు నిర్వహించడం. ఇలా
చేసేటప్పుడు చంద్రుడి ఆర్బిట్ నుంచి డైరెక్ట్ గా వాటిని విసిరేస్తే దాన్ని హార్డ్
లాండింగ్ అని, ప్యారాచుట్, లాండర్ వంటి సైంటిఫిక్ మెతడ్స్ ద్వారా నెమ్మదిగా
చంద్రుడిపై దించితే దాన్ని సాఫ్ట్ లాండింగ్ అంటారు. ఇప్పుడు ఇండియా చేసేది చంద్రుడి
పైన విక్రం అనే లాండర్ సహాయంతో ఒక రోవర్ ని క్రిందికి పంపి ప్రయోగాలు నిర్వహించడం.
అంటే సాఫ్ట్ లాండిగ్ అన్నమాట! అయితే ఇండియా కన్నా ముందే మూడు దేశాలు ఇప్పటికే
సాఫ్ట్ లాండింగ్ చేశాయి. అవి అమెరికా, రష్యా, చైనా.
@@@
ఇలాంటి
ప్రయోగం నిర్వహించడంలో భారత దేశం నాలుగో స్తానంలో ఉన్నా, ఇప్పటిదాకా ఆ దేశాలు ఎవరూ
చేయని సాహసాన్ని చేస్తోంది. అదేంటంటే ఇప్పటిదాకా చంద్రుడి ఈక్వేటర్ దగ్గరలోనే
అన్ని అన్ని దేశాలు సాఫ్ట్ లాండింగ్ చేశాయి. కానీ ఇస్రో మాత్రం చ౦ద్రుడికి అవతల
భాగం అంటే మూన్ యొక్క సౌత్ పోల్ కి 600 కిలో మీటర్ల దూరంలో రోవర్ ని సాఫ్ట్ ల్యాండ్ చేయబోతోంది. నిజానికి అక్కడ
ఎదురయ్యే సాంకేతిక కష్టాలు తట్టుకోలేక మిగతా దేశాలు చంద్రుడి సౌత్ పోల్ వద్ద ఇలాంటి
ధైర్యం చేయలేదు. అందుకే మన ఇస్రో ఎవరూ చేరుకోలేని ఈ ప్రాంతంలో పరిశోధనలు స్టార్ట్
చేయబోతోం ది. ఇన్ని డిఫికల్టీస్
ఉండబట్టే, అసలు చంద్రుడిపై వీళ్ళు ఏం చేయబోతున్నారు అని ప్రపంచం మొత్తం ఇస్రో వైపు
చూస్తోంది.
@@@
· చంద్రయాన్
-1 ప్రయోగంలో చందమామ పైన నీరు ఉన్నట్టు భారత్ కనుగొంది. ఇది 100% నిజం అని నాసా
కూడా ద్రువీకరించింది. దాదాపు 90% పైగా చంద్రుడి మాప్పింగ్ ని చంద్రయాన్ పూర్తి
చేసింది. చంద్రయాన్ -1 చేసిన పరిశోధనలు ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో తలమానికంగా
నిలిచిచాయి.
· అందుకే
దీనికి కొనసాగింపుగా వస్తున్న చంద్రయాన్ 2 ప్రయోగం ఇంకా ఎన్ని తెలియని
ఆవిష్కారాలకు శ్రీకారం చుడుతుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
· ప్రస్తుతం
చంద్రయాన్ 2; విశ్వం యొక్క ఆవిర్భావం సంబంధించిన మూలాలను కనుక్కోవడంతో పాటు,
చంద్రుదిపైన లభించే విలువైన మూలకాలు,
ఖనిజాలు, మినరల్స్ సంబంధించిన పరిశోధనలు చేపట్టనుంది.
· భవిష్యత్తులో
న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా విధ్యుత్ ఉత్పత్తి చేయడానికి హీలియం మూలకం ఎంతో
అవసరం. చంద్రుడిపై ఇది విరివిగా లభిస్తుందని భావిస్తున్నారు.
· అంతే
కాదు ప్రగ్యాన్ అనే రోవర్ ద్వారా 500మీటర్లు ఉపరితలం పై అక్కడి మట్టిని తవ్వి
అక్కడే స్వయంగా పరిశోధనలు చేస్తారు. దానితో పాటు చంద్రుడి వాతావరణంలోని అంశాలు
స్టడీ కూడా ఈ రోవర్ ద్వారా ఇక్కడినుంచే నిర్వహిస్తారు.
· ఇంత
కష్టపడి రోవర్ ని జబిల్లిపై పంపినా అది 15 రోజులు మాత్రమె పనిచేసే అవకాశం ఉంది
అంటున్నారు, ఎందుకంటే చంద్రుడిపై 15 రోజులు సూర్యుడు ఉంటె మిగతా 15 రోజులు చీకటిగా ఉంటుంది. ఈ రోవర్
పనిచేయడానికి కావలసిన సోలార్ ఎనర్జీ అందకపోతే అది పనిచేయలేకపోవచ్చు అని
భావిస్తున్నారు. అయినప్పటికీ, చందమామ పై అధ్యయనం కోసం ఇస్రో కి ఈ తక్కువ సమయం
చాలు.
@@@
· ఈ రాకెట్ ప్రయోగంలో మూడు దశలు ఉన్నాయి. రాకెట్ ప్రయోగించిన 16 నిమిషాల 13 సెకండ్లకు...
భూమి నుంచీ 181 కిలోమీటర్ల ఎత్తులో... చంద్రయాన్-2 ఉపగ్రహం, విక్రమ్
ల్యాండర్ ఉన్న పేలోడ్ రాకెట్ నుంచీ బయటకు వస్తుంది. అక్కడితో రాకెట్ పని
పూర్తయినట్లు లెక్క.
· ఈ పేలోడ్ భూ నియంత్రిత కక్ష్యా మార్గంలోకి చేరుతుంది. ఆ తర్వాత అది 17 రోజుల పాటూ రోదసిలో తిరుగుతూ... చందమామ దగ్గర్లోకి
వెళ్తుంది. ఆ తర్వాత మరో 6 రోజులు అలాగే తిప్పుతారు. ఆ తర్వాత చంద్రయాన్-2ని పేలోడ్ నుంచీ బయటకు తెస్తారు. అది 28 రోజులపాటూ చందమామ చుట్టూ తిరుగుతూ
ఉంటుంది. చివరకు అది అలా చందమామ ఆర్బిట్ లోకి చేరుతుంది.
· చంద్రయాన్-2 ప్రయోగం జరిగిన 50 రోజుల తర్వాత
పేలోడ్ నుంచీ విక్రమ్ ల్యాండర్ బయటకు వస్తుంది. ఇది 54వ రోజున అంటే సెప్టెంబర్ 6 లేదా 7న చందమామ దక్షిణ
ధ్రువంపై దిగుతుంది.
· ల్యాండర్ సేఫ్గా దిగిన తర్వాత... అందులోంచీ...
ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది.
అది చందమామపై 500 మీటర్ల ఏరియాలో తిరుగుతుంది.
· ప్రజ్ఞాన్ రోవర్... చందమామపై మట్టి, రసాయనాలు, నీటి జాడలు, మూలకాలు, ఖనిజాలు వంటి
విషయాల్ని ఇస్రోకి చేరవేస్తుంది.
· ప్రధానంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీరు గడ్డకట్టి ఉందని
ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ల్యాండర్ను
అక్కడ ల్యాండ్ చేస్తున్నారు.
· చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ... చందమామను హెచ్డీ
ఫొటోలు తీస్తూ... ఇస్రోకు పంపుతుంది.
· ప్రజ్ఞాన్ అంటే తెలివి అని అర్థం. చంద్రయాన్-2లో చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ కంటే... చందమామపై తిరిగే రోవర్ దే కీలక పాత్ర అనుకోవచ్చు.
ఎందుకంటే ఇప్పటివరకూ ఇలా చందమామపై రోవర్లను
దించిన దేశాలు అమెరికా, రష్యా, చైనా మాత్రమే.
· 27 కేజీల ప్రజ్ఞాన్ రోవర్... నీటికి సంబంధించి
ఎలాంటి సమాచారం ఇస్తుందా అని శాస్త్రవేత్తలు ఆసక్తిగా చూస్తున్నారు.
చందమామపై కావాల్సినంత నీరు ఉంటే...
ఇక మనుషులు అక్కడకు వెళ్లి, కాలనీలు ఏర్పాటు చేసుకునేందుకు వీలవుతుంది.
· ఐదేళ్లుగా చేస్తున్న ఈ మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978
కోట్లు అంటే 142 మిలియన్ డాలర్లు. ఆ మధ్య వచ్చిన
హాలీవుడ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకు అయిన ఖర్చు 356 మిలియన్ డాలర్లు. ఇంత తక్కువ ఖర్చుతో
అంత ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తున్న ఇస్రోపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు
కురుస్తోంది.
@@@
No comments:
Post a Comment